గోదావరిఖనిలో హెల్మెట్ పెట్టుకోని వారికి గులాబీలు

 గోదావరిఖనిలో హెల్మెట్ పెట్టుకోని వారికి గులాబీలు

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌరస్తాలో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు గురువారం స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ చేపట్టారు. వాహనదారులకు వన్​టౌన్​ సీఐ ఇంద్రసేనారెడ్డి హెల్మెట్​పెట్టుకోకుండా టూవీలర్స్​ నడుపుతున్నవారికి స్టూడెంట్ల చేత గులాబీ పువ్వులు ఇప్పించారు. 

బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్​పెట్టుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, ఎస్ఐ హరిశేఖర్, వన్ టౌన్ పోలీస్ సిబ్బంది, రెయిన్​బో స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.