AI గాడ్ ఫాదర్ : AI ఏదో ఒక రోజు మానవత్వాన్ని టేకోవర్ చేస్కుంటుంది

AI గాడ్ ఫాదర్ : AI ఏదో ఒక రోజు మానవత్వాన్ని టేకోవర్ చేస్కుంటుంది

గాడ్‌ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలవబడే జియోఫ్రీ హింటన్, ఏఐ(AI) వల్ల సంభవించే ప్రమాదాల గురించి హెచ్చరించాడు. సాంకేతికతను సురక్షితంగా అభివృద్ధి చేయడానికి గల ఉత్తమ మార్గాలను ప్రభుత్వాలు, కంపెనీలు జాగ్రత్తగా పరిశీలించాలని కోరారు. హింటన్ ఈ సంవత్సరం ప్రారంభంలో గూగుల్ నుంచి రిటైర్ అయ్యారు.

బ్రిటీష్ కంప్యూటర్ సైంటిస్ట్, కాగ్నిటివ్ సైకాలజిస్ట్ అయిన జియోఫ్రీ.. "ఐదేళ్ల కాలంలో.. అంటే 2027 నాటికి ఏఐ మనకంటే.. మనుషుల కంటే బాగా పని చేయగలదు.. మనుషులను రీ ప్లేస్ చేయగలదు.. ఈ విషయాన్ని నేను గట్టిగా చెప్పగలను అని వ్యాఖ్యానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామహుడుగా చెప్పబడే.. పిలవబడే జియోఫ్రీ ఈ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

జియోఫ్రీ హింటన్ AI ఫ్రేమ్‌వర్క్‌పై చేసిన కృషి వల్లే.. ఇవాళ ఏఐకి ఓ రూపం వచ్చింది అంటారు టెక్ నిపుణులు. వేగంగా అభివృద్ధి చెందుతున్న.. మారుతున్న సాంకేతికతను మానవులు పూర్తిగా అర్థం చేసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. "మనం మొదటిసారిగా, మనకంటే ఎక్కువ తెలివైన విషయాలు కలిగి ఉన్న కాలంలోకి వెళుతున్నామని.. నేను భావిస్తున్నాను అంటూ చెప్పటం విశేషం. టెక్నాలజీ ఆలోచన ఏమిటో అర్థం చేసుకోవడం మనిషి మనసును చదివినంత కష్టమని అన్నారు. ఇది ఏం చేస్తుందో మాకు చాలా మంచి ఆలోచన ఉంది.. కానీ ఇది నిజంగా సంక్లిష్టంగా మారితే ఏం జరుగుతుందో మాకు తెలిసిన దానికంటే ఎక్కువ ఏం జరుగుతుందో మాకు తెలియదు" అంటూ రాబోయే ప్రమాదాన్ని సైతం ఊహించటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏఐ సృష్టికర్తగా పేరున్న జియోఫ్రీ హింటన్ చేసిన ఈ వ్యాఖ్యలు.. రాబోయే రోజుల్లో.. టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టొచ్చు అని అంచనా వేస్తున్నారు.. టెన్ నిపుణులు.

మానవులు ఏఐ నియంత్రణను కోల్పోతే అది ఆందోళనకరంగా ఉంటుందని హింటన్ అన్నారు. "మేము ఇంతకు ముందెన్నడూ చేయని.. ఊహించని విషయాలతో భవిష్యత్ కాలంలోకి ప్రవేశిస్తున్నాము" అన్న ఆయన... AI మానవత్వాన్ని స్వాధీనం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని హింటన్ హెచ్చరించారు. "అది జరుగుతుందని నేను చెప్పడం లేదు. మనం అది జరగకుండా, కోరుకోకుండా ఆపగలిగితే, అది గొప్పగా ఉంటుంది. కానీ అది కూడా మనం ఆపగలుగుతామని చెప్పలేం అంటూ రాబోయే ప్రమాదాన్ని ఊహించారు హింటన్. మనిషి సామర్థ్యాన్ని పెంచడంలో AI సహాయపడుతుందని.. అయితే కృత్రిమ మేధస్సు కారణంగా చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని.. కోల్పోయిన ఉద్యోగాలను భర్తీ చేయడానికి తగినంత మంది ఉద్యోగులు ఉండకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

మొత్తంగా ఏఐ గాడ్ ఫాదర్ జియోఫ్రీ హంటన్ చేసిన మాటల్లోని ఆంతర్యం చూస్తుంటే.. 2027 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని గట్టిగానే అంచనాకు వస్తున్నారు టెక్ నిపుణులు. బీ కేర్ ఫుల్ జనం.. మనం మారకపోతే మనుగడ ఉండదు.. ఉద్యోగమా ఉండదు.. అప్ డేట్ కావాల్సిందే.. ఏఐ కాలానికి.. బీ అలర్ట్..