
- కులవృత్తుల పనిముట్లతో బయలుదేరుతామన్న జాజుల
ఖైరతాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం చట్టం చేసేలా కేంద్రమంత్రి కిషన్రెడ్డి కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. కుందారం గణేశ్చారి అధ్యక్షతన బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విస్త్రత స్థాయి సమావేశం నిర్వహించారు.
శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ ఇప్పుడు మాట మార్చుతోందని, మైనారిటీ రిజర్వేషన్ల సాకుతో అన్యాయం చేయాలని చూస్తుందన్నారు. ఏప్రిల్ 2న ఢిల్లీలోని జంతర్ మంతర్వద్ద జరిగే ‘బీసీ పోరు గర్జన’కు భారీగా తరలిరావాలని, 31న ఉదయం సికింద్రాబాద్స్టేషన్నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందన్నారు. అన్ని కుల వృత్తుల పనిముట్లను ఢిల్లీలో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. మాజీ ఎంపీ వి.హెచ్, బాలరాజు గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ముదిరాజ్, ప్రొఫెసర్భాగయ్య, వేముల వెంకటేశం, దుర్గయ్య గౌడ్, లక్ష్మణ్యాదవ్ పాల్గొన్నారు.