
- గతేడాది పొరపాట్లు రిపీట్ కావొద్దు
- ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
- కోటలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష
మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ జగదాంబిక బోనాల ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, గతేడాది జరిగిన పొరపాట్లను రిపీట్ కావొద్దని ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం గోల్కొండ కోటలో సిటీ అడిషనల్ సీపీ విక్రమ్ మాన్ సింగ్, అడిషనల్ కలెక్టర్ ముకుందారెడ్డి, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్, ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్బీ డీసీపీ అపూర్వరావు, గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్, గోల్కొండ జగదాంబిక ఆలయ ట్రస్టీ చైర్మన్ చంటిబాబుతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, గతేడాది కంటే అత్యంత వైభవంగా గోల్కొండ జగదాంబిక బోనాల ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. సమావేశానికి కొన్ని శాఖల అధికారులు రాకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ఆలయ ఈవో వసంత, ట్రస్ట్ కమిటీ సభ్యులు, నాయకులు సంతోశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.