
Gold Price Today: అమెరికా చైనా మధ్య వాణిజ్య ప్రకంపనలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిస్థితులు ప్రస్తుతం పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో బులియన్ మార్కెట్లో ధరల పరుగులు సామాన్య భారతీయ కుటుంబాలను షాక్ కి గురిచేస్తున్నాయి. తులం బంగారం లక్ష రూపాయల మార్కుకు తిరిగి చేరుకోవటంతో అంత రేటు పెట్టు తాము కొనలేమని అంటున్నారు. కనీసం పెట్టుబడిగా పెట్టేవారికి కూడా ఈ రేటు కలిసొచ్చేదిగా అస్సలు కనిపించటం లేదు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.4వేల భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 130, ముంబైలో రూ.9వేల 130, దిల్లీలో రూ.9వేల 145, కలకత్తాలో రూ.9వేల 130, బెంగళూరులో రూ.9వేల 130, కేరళలో రూ.9వేల 130, వడోదరలో రూ.9వేల 135, జైపూరులో రూ.9వేల 145, లక్నోలో రూ.9వేల 145, మంగళూరులో రూ.9వేల 130, నాశిక్ లో రూ.9వేల 133, అయోధ్యలో రూ.9వేల 145, బళ్లారిలో రూ.9వేల 130, నోయిడాలో రూ.9వేల 145, గురుగ్రాములో రూ.9వేల 145 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు ఏకంగా రూ.4వేల 300 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలు గ్రాముకు గమనిస్తే.. చెన్నైలో రూ.9వేల 960, ముంబైలో రూ.9వేల 960, దిల్లీలో రూ.9వేల 975, కలకత్తాలో రూ.9వేల 960, బెంగళూరులో రూ.9వేల 960, కేరళలో రూ.9వేల 960, వడోదరలో రూ.9వేల 965, జైపూరులో రూ.9వేల 975, లక్నోలో రూ.9వేల 975, మంగళూరులో రూ.9వేల 960, నాశిక్ లో రూ.9వేల 963, అయోధ్యలో రూ.9వేల 975, బళ్లారిలో రూ.9వేల 960, నోయిడాలో రూ.9వేల 975, గురుగ్రాములో రూ.9వేల 975గా ఉన్నాయి.
►ALSO READ | ITR Filing: టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 300 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 600గా ఉంది. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు రూ.2వేలు పెరిగి రూ.లక్ష 14వేల వద్ద ఉంది.