పదుల సంఖ్యలో గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. గడికో గ్రాండ్ మాస్టర్ చొప్పున చదరంగంలోని 64 గడులూ నిండి పోయాయి. విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి వంటి లెజెండరీ ప్లేయర్లు ఆటకే వన్నె తెచ్చారు. వరల్డ్ చాంపియన్షిప్స్, నంబర్ వన్ ర్యాంక్లు, మరెన్నో మేటి ట్రోఫీలు, టైటిళ్లు వచ్చాయి. ఒక్క చెస్ ఒలింపియాడ్ గోల్డ్ తప్ప.
ఇప్పుడు ఆ లోటు కూడా తీరింది. దాదాపు వందేళ్ల ఘన చరిత్ర ఉన్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇండియా బంగారు కల తీరింది. ఫైనల్ చేరిన తొలి సారే మన జట్టు గోల్డ్తో తిరిగొచ్చింది. ఇంటర్నెట్ ఫెయిల్యూర్, సర్వర్ ప్రాబ్లమ్స్ తో ఆదివారం వివాదాస్పద రీతిలో జరిగిన టైటిల్ ఫైట్లో రష్యాతో కలిసి ఇండియా జాయింట్ విన్నర్గా నిలిచింది. తొలుత రష్యానే విజేతగా తేల్చారు. కానీ, సెకండ్ రౌండ్లో నిహాల్సరిన్, దివ్యా దేశ్ ముఖ్ సర్వర్ ప్రాబ్లమ్ కారణంగా ఓడిపోవడంతో ఈ రిజల్ట్ను ఇండియా సవాల్ చేసింది. 40 నిమిషాల ఉత్కంఠ తర్వాత ఫిడే రెండు జట్లను విజేతలుగా తేల్చడంతో కథ సుఖాంతమైంది. ఇండియా టీమ్లో ముగ్గురు తెలుగు ప్లేయర్లు ఉండడం విశేషం.
హైదరాబాద్, వెలుగు: చెస్ ఒలింపియాడ్లో ఇండియా టీమ్ హిస్టరీ క్రియేట్ చేసింది. కరోనా నేపథ్యంలో తొలిసారి ఆన్లైన్లో జరిగిన మెగా ఈవెంట్లో రష్యాతో కలిసి జాయింట్ విన్నర్గా నిలిచింది. తెలుగమ్మాయి కోనేరు హంపి అసమాన పోరాట పటిమతో తుదిపోరుకు దూసుకెళ్లిన ఏడో సీడ్ ఇండియా ఆదివారం వివాదాస్పద రీతిలో సాగిన ఫైనల్లో టాప్ సీడ్ రష్యాతో హోరాహోరీగా తలపడింది. ఫస్ట్ రౌండ్ను3–3తో డ్రా చేసుకుంది. కెప్టెన్ విదిత్, హంపి, పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక, ప్రజ్ఞానంద, దివ్య దేశ్ముఖ్ తమ గేమ్స్ను డ్రా చేసుకున్నారు. ఇక సెకండ్ రౌండ్లోనూ తొలి మూడు గేమ్స్లో ఫలితం రాలేదు. హరికృష్ణ ప్లేస్లో వచ్చిన ఆనంద్.. ఇయాన్ నెపొమ్నియాచితో, డానిల్ డుబోవ్తో విదిత్, అలెగ్జాండ్రా కొస్తెనియుక్తో హారిక పాయింట్ పంచుకోవడంతో టెన్షన్ పెరిగింది. ఈ టైమ్లో హంపిని అలెగ్జాండ్రా గొర్యచ్కినా ఓడించింది. హంపి కూడా కాసేపు సర్వర్ ప్రాబ్లమ్ ఎదుర్కొంది.
ఈ లోపు ఆండ్రే ఎసిపెంకో చేతిలో సరిన్, పొలినా షువలోవా చేతిలో దేశ్ముఖ్ ఓడిపోవడంతో అంతా షాకయ్యారు. ఈ రెండు గేమ్లు మధ్యలో ఉండగా టోర్నీ నిర్వహిస్తున్న చెస్ డాట్ కామ్లో సర్వర్ ప్రాబ్లమ్ వచ్చింది. ఇంటర్నెట్ మొరాయించడంతో ఇండియా ప్లేయర్లు టైమ్ కోల్పోయి గేమ్ పూర్తి చేయలేక ఓడిపోయారు. తన గేమ్ను సరిన్ డ్రా చేసుకునే వాడు. మరోవైపు పొలినాపై దివ్య కచ్చితంగా గెలిచే సిచ్యువేషన్లో నిలిచింది. కానీ, 4.5–1.5తో ఈ రౌండ్ గెలిచిన రష్యాను విన్నర్గా ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయాన్ని ఇండియా అఫీషియల్గా సవాల్ చేసింది. నిహాల్, దివ్య సర్వర్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారని ఫిడే దృష్టికి తెచ్చింది. దాంతో, ఫిడే ప్రెసిడెంట్ అర్కడీ వొర్కొవిచ్ రెండు జట్లకు గోల్డ్ షేర్ చేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే ‘మేం చాంపియన్స్ అయ్యాం. కంగ్రాంట్స్ రష్యా’ అని ఆనంద్ ట్వీట్ చేశాడు. ఈ టోర్నీలో ఇండియాకు ఇది సెకండ్ మెడల్. 2014లో వచ్చిన బ్రాంజ్ మెడలే ఇప్పటిదాకా అత్యుత్తమం. కాగా, ఇండియా టీమ్ను ప్రధాని నరేంద్ర మోడీ, స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు సహా పలువురు అభినందించారు. మన ప్లేయర్ల కృషి, పట్టుదల అభినందనీయమని మోడీ ట్వీట్ చేశారు.