
న్యూఢిల్లీ: బలమైన అంతర్జాతీయ సంకేతాల వల్ల సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగి రూ.1,16,200 రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.1,14,000 వద్ద ముగిసింది. స్థానిక మార్కెట్లో, 99.5 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.2,150 పెరిగి రికార్డు గరిష్ట స్థాయి రేటు రూ.1,15,650 కి చేరింది.
హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కు చెందిన సౌమిల్ గాంధీ మాట్లాడుతూ, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాలు డాలర్, ట్రెజరీ యీల్డ్స్పై ప్రభావం చూపాయని, దీనివల్ల విలువైన లోహాల ధరలు పెరిగాయని చెప్పారు. ఈ ఏడాదిలో బంగారం ధర రూ.37,250 (47.18 శాతం) పెరిగిందని అసోసియేషన్ తెలిపింది.