Gold News: రేపటి నుంచి తగ్గనున్న బంగారం ధర..! స్పాట్ మార్కెట్లో ఢమాల్.. మీదారెటు?

Gold News: రేపటి నుంచి తగ్గనున్న బంగారం ధర..! స్పాట్ మార్కెట్లో ఢమాల్.. మీదారెటు?

Gold Prices: అమెరికాలో జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లతో పాటు పసిడి ప్రియులను ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నాయి. అమెరికా కోర్టు ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్ అమలును నిలుపదల చేస్తూ ఇచ్చిన తీర్పు ప్రపంచ వ్యాప్తంగా దేశాలకు ఊరటను కలిగిస్తోంది. 

ట్రంప్ తన పరిధి దాటి టారిఫ్స్ విధించారంటూ పేర్కొన్న కోర్టు వాటి అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేయటంతో మల్టీ కమోడిటి ఎక్స్ఛేంజీలో జూన్ గోల్డ్ కాంట్రాకుల ధర 10 గ్రాములకు రూ.378 తగ్గి రూ.94వేల 900కి చేరుకుంది. ఇదే తరహాలో వెండి ధరలు కూడా తగ్గుదలను నమోదు చేయటంతో ప్రజలు సంతోషంలో ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో సైతం ఇదే ధోరణి కనిపించటంతో రేటు భారతీయ రిటైల్ మార్కె్ట్లో కూడా ధరల తగ్గుదల కొనసాగుతుందని చాలా మంది భావిస్తున్నారు.

అమెరికా కోర్టు తీర్పుతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ, కమోడిటీ మార్కెట్లలో బుల్ ర్యాలీ కొనసాగుతోంది. అయితే రిస్క్ తగ్గటంతో బంగారం ధరలు ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడితో చిత్తవుతున్నాయని అజయ్ కేడియా పేర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే రానున్న కొద్ది రోజుల్లో గోల్డ్ 10 గ్రాముల ధర రూ.92వేల 200 స్థాయికి తగ్గవచ్చని అన్నారు. ఈ పరిస్థితుల్లో సేఫ్ హెవెన్ బంగారం నుంచి ఇన్వెస్టర్లు తమ డబ్బును ఈక్విటీ మార్కెట్లలోకి తీసుకురావటానికి మార్గం సుగమమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : కేరళ వ్యక్తికి జాక్‌పాట్

ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్న రక్షణవాదం, వ్యాపార సరళీకరణ మధ్య ఆదేశ విశ్వసనీయత ప్రపంచ వ్యాప్తంగా దెబ్బతింది. ప్రస్తుతం కోర్టులో వచ్చిన తీర్పు ప్రపంచ దేశాలకు సానుకూలంగానే ఉన్నప్పటికీ అంతర్గతంగా అందులో లోతైన అస్థిరత మిగిలే ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఉన్న సమయంలో తమ పెట్టుబడులను ఈక్విటీల్లోకి మరల్చటానికి ప్రయత్నించవచ్చని ఇదే క్రమంలో అనూహ్యంగా ఎదురయ్యే అస్థిరతలను ఎదుర్కోవటానికి హెడ్జ్ గా బంగాన్ని కూడా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. తాత్కాలికంగా స్టాక్స్ బౌన్స్ అయినప్పటికీ బంగారం తన మెరుపును ప్రపంచ వ్యాప్తంగా కొనసాగిస్తుందని నిపుణులు అంటున్నారు. మెుత్తానికి అమెరికా కోర్టు నిర్ణయం తర్వాత ఈక్విటీలలో స్వల్పకాలిక ర్యాలీకి అవకాశం ఉందని మెహతా ఈక్విటీస్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ ప్రశాంత్ తాప్సే పేర్కొన్నారు.