Gold Rate: చవితి తర్వాత పెరిగిన గోల్డ్.. తెలంగాణ నగరాల్లో రేట్లివే..

Gold Rate: చవితి తర్వాత పెరిగిన గోల్డ్.. తెలంగాణ నగరాల్లో రేట్లివే..

Gold Price Today: వినాయకచవితి తర్వాత గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. యూఎస్ ట్రేడ్ టారిఫ్స్ అమలులోకి వచ్చిన తర్వాత ఇన్వెస్టర్లు కొంత సేఫ్ హెవెన్ గోల్డ్ లో పెట్టుబడులకు చూస్తుండటం తాజా పెరుగుదలకు ఒక కారణంగా నిపుణలు చెబుతున్నారు. అయితే ఇది స్వల్పకాలమే ఉంటుందని వారు అంటున్నారు. ఈ క్రమంలో శుభకార్యాలకు షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ముందుగా పెరిగిన తాజా రిటైల్ గోల్డ్, సిల్వర్ రేట్లను తెలుసుకోవటం మంచిది. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే ఆగస్టు 27తో పోల్చితే 10 గ్రాములకు ఆగస్టు 28న రూ.160 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.16 స్వల్పంగా పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన తాజా రిటైల్ విక్రయ రేట్లను పరిశీలిస్తే.. 

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(ఆగస్టు 28న):

  • హైదరాదాబాదులో రూ.10వేల 260
  • కరీంనగర్ లో రూ.10వేల 260
  • ఖమ్మంలో రూ.10వేల 260
  • నిజామాబాద్ లో రూ.10వేల 260
  • విజయవాడలో రూ.10వేల 260
  • కడపలో రూ.10వేల 260
  • విశాఖలో రూ.10వేల 260
  • నెల్లూరు రూ.10వేల 260
  • తిరుపతిలో రూ.10వేల 260

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఆగస్టు 27తో పోల్చితే ఇవాళ అంటే ఆగస్టు 28న 10 గ్రాములకు రూ.150 పెరుగుదలను చూసింది. దీంతో ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ రేట్లను గమనిస్తే..

ALSO READ : బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌లో ఏఐ టెక్నాలజీ..

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(ఆగస్టు 28న):

  • హైదరాదాబాదులో రూ.9వేల 405
  • కరీంనగర్ లో రూ.9వేల 405
  • ఖమ్మంలో రూ.9వేల 405
  • నిజామాబాద్ లో రూ.9వేల 405
  • విజయవాడలో రూ.9వేల 405
  • కడపలో రూ.9వేల 405
  • విశాఖలో రూ.9వేల 405
  • నెల్లూరు రూ.9వేల 405
  • తిరుపతిలో రూ.9వేల 405

బంగారం రేట్లు ర్యాలీ కొనసాగిస్తుండగా మరోపక్క వెండి స్థిరంగా కొనసాగిస్తోంది. ఆగస్టు 28న కేజీకి ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 30వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము వెండి రేటు రూ.130గా ఉంది.