
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి ఇండిగో విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల దగ్గర రూ. కోటి 10 లక్షల విలువ చేసే 3 కిలోల 951 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకులు తన లోదుస్తులకు ప్రత్యేకంగా జేబును కుట్టుకొని అందులో బంగారు బిస్కెట్లు తేవడానికి ప్రయత్నించగా, కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. అసలు సూత్రధారుల కోసం లోతుగా విచారణ జరుపుతున్నామని తెలిపారు అధికారులు.