బంగారం అక్రమ రవాణా: వ్యక్తి అరెస్ట్

బంగారం అక్రమ రవాణా: వ్యక్తి అరెస్ట్

బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టుబడ్డాడు ఓ వ్యక్తి. అతని వద్ద నుండి 53లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కస్టమ్స్ అధికారులు. నిందితుడి దగ్గర నుండి 15 బంగారు కడ్డీలు లభించాయని.. అవి 1.6కిలోల బరువు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అతడు సౌదీఅరేబియా పౌరుడిగా గుర్తించినట్టు తెలిపారు కస్టమ్స్ అధికారులు.  బంగారాన్ని ప్లాస్టిక్ కవర్లలో చుట్టి తరలిస్తున్నట్లు చెప్పారు. నిందితున్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.