
గంగాధర, వెలుగు : తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ వంశీకృష్ణ తెలిపిన ప్రకారం.. గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన ఉప్పుగండ్ల గంగారెడ్డి ఆదివారం ఇంటికి తాళం వేసి తాగునీరు తెచ్చేందుకు వెళ్లాడు. కొద్ది సేపటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా బీరువాలోని 33 తులాల బంగారం, వెండి, నగదు చోరీ అయింది. వెంటనే గంగాధర పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
కరీంనగర్ రూరల్సీఐ శుభం ప్రకాష్క్లూస్టీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా ఇటీవల లక్ష్మీదేవిపల్లి, మధురానగర్లో తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయని, గస్తీ ముమ్మరం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.