జీడిమెట్ల లోని దుర్గామాత ఆలయంలో బంగారం చోరీ

జీడిమెట్ల లోని దుర్గామాత ఆలయంలో బంగారం చోరీ
  •     పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఘటన

జీడిమెట్ల, వెలుగు : దుర్గామాత ఆలయంలో బంగారం చోరీ ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. గురువారం తెల్లవారుజామున జీడిమెట్లలోని సరోజిని గార్డెన్ వద్ద ఉన్న దుర్గామాత ఆలయంలోకి వచ్చిన ఓ దొంగ గుడి తలుపులు పగులగొట్టాడు. అమ్మవారి బంగారు తాళిబొట్టను దొంగిలించాడు. అయితే, చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆలయ కమిటీ కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.