
పద్మారావునగర్, వెలుగు: క్రీడలకు వయస్సుతో సంబంధం లేదని, ఆరోగ్యవంతమైన జీవితానికి ఆటలు ఎంతో అవసరమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జింఖానా గ్రౌండ్స్లో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ చాంపియన్షిప్– 2025 క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు.
30 ఏండ్ల వయస్సు పైబడిన వారికి నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొన్న వారిని ఎమ్మెల్యే అభినందించారు. విజేతలకు మెడల్స్ అందచేశారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.