
న్యూఢిల్లీ: తయారీదారులు అమ్ముడుపోని స్టాక్పై జీఎస్టీ కొత్త రేట్ల ప్రకారం గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ)ని సవరించుకోవడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం (సెప్టెంబర్ 09) అనుమతించింది. ఈ చర్య వినియోగదారులకు, కంపెనీలకు భారీ ఊరట కల్పించనుంది.
జీఎస్టీ రేట్ల సవరణకు ముందు తయారు చేసిన లేదా దిగుమతి చేసుకున్న అమ్ముడుపోని ప్యాకేజ్డ్ వస్తువుల మీద తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులు కొత్త ఎంఆర్పీని తప్పనిసరిగా ప్రకటించాలి. స్టాంపింగ్, స్టిక్కర్ అతికించడం లేదా ఆన్లైన్ ప్రింటింగ్ ద్వారా వివరాలు తెలియజేయాలి.
అసలు ఎంఆర్పీ కూడా కనిపించేలా ఉండాలి. ఈ ధర మార్పును ప్రకటిస్తూ, తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులు కనీసం రెండు ప్రకటనలను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వార్తాపత్రికలలో ప్రచురించాలి. డీలర్లకు, కేంద్ర ప్రభుత్వంలోని లీగల్ మెట్రాలజీ డైరెక్టర్కు, రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల లీగల్ మెట్రాలజీ కంట్రోలర్లకు నోటీసులను పంపాలి.
ఈ అనుమతి డిసెంబర్ 31, 2025 వరకు లేదా స్టాక్ అయిపోయే వరకు, ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది వరకు చెల్లుబాటు అవుతుంది.