
Gold Price Today: బంగారం ధరలు ఈవారం ప్రపంచ పరిస్థితులు కుదుటపడటంతో కిందకు దిగివస్తున్నాయి. అమెరికా అనేక దేశాలతో వరుసగా ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవటంతో పాటు ఇండియా-పాక్ వివాదం కొలిక్కి రావటం వంటి అంశాలు ఆందోళనలు తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో ఈవారం రెండో సారి పసిడి ధరలు భారీగా తగ్గుదలను నమోదు చేశాయి. అయితే షాపింగ్ చేయాలనుకుంటున్న వారు ముందుగా తగ్గిన ధరలను పరిశీలించటం ఉత్తమం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5వేల భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ తాజా ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 805, ముంబైలో రూ.8వేల 805, దిల్లీలో రూ.8వేల 820, కలకత్తాలో రూ.8వేల 805, బెంగళూరులో రూ.8వేల 805, కేరళలో రూ.8వేల 805, పూణేలో రూ.8వేల 805, వడోదరలో రూ.8వేల 810, జైపూరులో రూ.8వేల 820, లక్నోలో రూ.8వేల 820, మంగళూరులో రూ.8వేల 805, నాశిక్ లో రూ.8వేల 808, అయోధ్యలో రూ.8వేల 820, మైసూరులో రూ.8వేల 805, గురుగ్రాములో రూ.8వేల 820, నోయిడాలో రూ.8వేల 820 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే నేడు రూ.5వేల 400 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 606, ముంబైలో రూ.9వేల 606, దిల్లీలో రూ.9వేల 621, కలకత్తాలో రూ.9వేల 606, బెంగళూరులో రూ.9వేల 606, కేరళలో రూ.9వేల 606, పూణేలో రూ.9వేల 606, వడోదరలో రూ.9వేల 611, జైపూరులో రూ.9వేల 621, లక్నోలో రూ.9వేల 621, మంగళూరులో రూ.9వేల 606, నాశిక్ లో రూ.9వేల 609, అయోధ్యలో రూ.9వేల 621, మైసూరులో రూ.9వేల 606, గురుగ్రాములో రూ.9వేల 621, నోయిడాలో రూ.9వేల 621గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 805 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.9వేల 606గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 9వేల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.