హసన్ పర్తి, వెలుగు : హైదారాబాద్ లోని బతుకమ్మ కుంట చెరువును అభివృద్ధి చేసినట్లే హనుమకొండ జిల్లా గోపాలపూర్ ఊర చెరువును అభివృద్ధి చేస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య అన్నారు. గోపాలపూర్ ఊర చెరువు పూడికతీత పనులకు శుక్రవారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఎంపీ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
అనంతరం హసన్పర్తి మండల పరిధిలోని పెంబర్తి నుంచి అంబాల వరకు రూ.1.50 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
