టాలీవుడ్లో హిట్ కాంబోను రిపీట్ చేయడం కామన్గా జరుగుతూనే ఉంటుంది. గోపీచంద్ కూడా తనకు హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ వర్క్ చేయాలనుకుంటాడు. ఇప్పటికే లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ డైరెక్షన్లో రెండు సినిమాలు చేసిన గోపీచంద్.. ప్రస్తుతం మూడో మూవీ ‘రామబాణం’లో నటిస్తున్నాడు. తాజాగా మరో హిట్ కాంబోను రిపీట్ చేయడానికి ప్లాన్ చేశాడట.
ఎనిమిదేళ్ల క్రితం గోపీచంద్ను స్టైలిష్గా చూపిస్తూ ‘జిల్’ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాడు రాధాకృష్ణ కుమార్. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుందనే వార్తలు ఎప్పట్నుంచో వస్తున్నా.. అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. గోపీచంద్కి ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఇప్పుడు ప్రభాసే స్వయంగా ఈ ప్రాజెక్టు సెట్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ గోపీచంద్ కథ విని ఓకే కూడా చెప్పేశాడట. యాక్షన్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందని.. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.