గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామబాణం’. జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడ్కర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం రాజమండ్రిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘శ్రీవాస్తో నాకిది మూడో సినిమా. లక్ష్యం, లౌక్యం ఎలా ఉంటాయో.. అలాగే ఇది కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ‘రామబాణం’ టైటిల్ పెట్టిన బాలకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్. సినిమా చూసేటప్పుడు ఇది మన ఇంట్లో జరుగుతున్న కథలా అనిపిస్తుంది. వేసవిలో సినిమా చూసి కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అన్నాడు. డింపుల్ మాట్లాడుతూ ‘ఇందులో అన్నదమ్ముల బంధం గురించి ఉంటుంది. ఫ్యామిలీ వాల్యూస్తో పాటు కామెడీ, సాంగ్స్ కూడా అందరికీ నచ్చుతాయి’ అని చెప్పింది. ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి చూసే సినిమా ‘రామబాణం’ అన్నాడు శ్రీవాస్. కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల, అలీ, రాజమండ్రి ఎంపీ భరత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.