
గోరఖ్పూర్ నీట్ అభ్యర్థి హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల చేతిలో హతమయ్యాడు. నిందితుడు మహ్మద్ జుబైర్ను రాంపూర్ జిల్లాలో శుక్రవారం(సెప్టెంబర్27) రాత్రి ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్) కాల్చి చంపింది. మృతుడు జుబైర్ పై అనేక కేసులున్నాయని పోలీసులు తెలిపారు. అతనిపై లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది. యూపీ వ్యాప్తంగా జుబైర్ ఆవుల అక్రమ రవాణాకు పాల్పడినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 16న పశువుల అక్రమ రవాణాదారులు చేస్తున్న స్మగ్లర్లు నీట్ విద్యార్థి దీపక్ గుప్తాను కాల్చి చంపారు. అతను గోరఖ్పూర్లో నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. దీపక్ గుప్తా హత్య తర్వాత జుబైర్ పరారీలో ఉన్నాడు.
రిపోర్టుల ప్రకారం.. సెప్టెంబర్ 16 తెల్లవారు జామున ఓ గ్రామం నుంచి పశువులను దొంగిలిస్తున్న ముఠాను దీపక్ గుప్తా అ డ్డుకున్నారు. పశువులు తరలిస్తున్న వాహనాలను స్కూటర్వెంబడించాడు. నిందితుడు దీపక్ గుప్తాను పట్టుకొని వాహనంలో గంటకు పైగా తిప్పి అనంతరం నోట్లో కాల్చి చంపారని ఆరోపణలు ఉన్నాయి.
దీపక్ గుప్తా మృతితో గోరఖ్పూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది..స్థానికులు గోరఖ్పూర్- పిప్రైచ్ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. నిరసన హింసాత్మకంగా మారింది. ఉత్తరప్రదేశ్ అదనపు డైరెక్టర్ జనరల్ (ADG) ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సహా సీనియర్ పోలీసు అధికారులు కేసును సీరియస్ గా తీసుకున్నారు.
ALSO READ : విధ్వంసం సృష్టించేవాళ్ల కోసమే బుల్డోజర్లు..
సెప్టెంబర్ 17న ఈ కేసుకు సంబంధించి ఓ నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని పట్టుకునే సమయంలో రహీమ్గా గుర్తించబడిన నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైంది. తాజాగా పోలీసుల ఎన్ కౌంటర్లో కీలక నిందితుడు మహ్మద్ జుబైర్మృతిచెందాడు.
BIG BREAKING 🚨 Mohammad Zubair, main accused in the murder of NEET student Deepak Gupta in Gorakhpur, killed in a UP STF encounter in Rampur
— Times Algebra (@TimesAlgebraIND) September 26, 2025
He had many cases against him, a ₹1 lakh reward
He was involved in cow smuggling & selling beef in Muslim areas pic.twitter.com/WJORYlBb5s