- ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్అలీ
కామారెడ్డి, వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. శుక్రవారం
భిక్కనూరు మండలంలోని ఆయా గ్రామాల నుంచి బీజేపీ, బీఆర్ఎస్ నుంచి షబ్బీర్అలీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
పార్టీలో చేరినవారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సీఎం రేవంత్రెడ్డి నాయకత్వం, స్థానిక అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. పీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్రెడ్డి, మండల ప్రెసిడెంట్ భీమ్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
