
కామారెడ్డి, వెలుగు : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. గురువారం మాచారెడ్డి మండలానికి చెందిన వారు అధిక సంఖ్యలో వెళ్లి షబ్బీర్అలీని కలిసి సన్మానించారు.
అనంతరం షబ్బీర్అలీ మాట్లాడుతూ మాచారెడ్డి మండలాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్దికి నిరంతరం కృషి చేస్తానన్నారు.