
- జిల్లా కేంద్రాల నుంచి మండలాలు, రెసిడెన్షియల్ స్కూల్స్కు పంపిణీ
- స్కూల్స్ రీ ఓపెన్ కాగానే విద్యార్థులకు అందజేత
కామారెడ్డి/నిజామాబాద్, వెలుగు : బడులు ప్రారంభం కాగానే విద్యార్థులకు టెక్స్ట్, నోట్ బుక్స్, యూనిఫామ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 90 శాతం టెక్స్ట్ బుక్స్ రాగా, యూనిఫామ్స్ రెడీ అవుతున్నాయి. నోటుబుక్స్ మాత్రం నేరుగా స్కూళ్లకు పంపిస్తారు. ఉమ్మడి జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో 2,04,559 మంది విద్యార్థులు ఉండగా, 12,48,590 టెక్స్ట్ బుక్స్ అవసరం. ఇప్పటికే 11,23,731( 90 శాతం) బుక్స్ వచ్చాయి. 7, 8, 9 తరగతులను సంబంధించిన హిందీ, కొన్ని అభ్యసన బుక్స్ రావాల్సి ఉంది. జూన్ 12న స్కూళ్లు ప్రారంభం కానుండగా, జూన్1 నాటికే బుక్స్చేరేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లోని గోడౌన్స్ నుంచి మండలాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు పుస్తకాల సరఫరా ప్రారంభమైంది. ఇప్పటికే పలు మండలాలకు టెక్స్ట్ బుక్స్ చేరాయి.
నిజామాబాద్ జిల్లా
జిల్లాలో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ 693, యూపీఎస్లు 116, హైస్కూల్స్ 230, కేజీబీవీలు 25, మాడల్ స్కూల్స్ 10 ఉండగా, 1,22,264 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 7,18,590 టెక్స్ట్బుక్స్ అవసరం కాగా, 6,46,731 బుక్స్ జిల్లా కేంద్రానికి వచ్చాయి. ఇందులో 2,20,792 టెక్స్ట్ బుక్స్ మండలాలు, రెసిడెన్షియల్ స్కూల్స్కు పంపించారు. మిగతావి వారంలో పంపనున్నారు.
కామారెడ్డి జిల్లా
జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్, కేజీబీవీ, మాడల్ స్కూల్స్ కలిపి 1,081 ఉండగా, 82,295 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 5,30,000 టెక్స్ట్బుక్స్ అవసరం కాగా, ఇప్పటికే 4,77,000 బుక్స్ వచ్చాయి. వీటిని మండలాలు, రెసిడెన్షియల్ స్కూల్స్కు సప్లయ్ చేస్తున్నారు.
స్కూల్యూనిఫామ్స్
కామారెడ్డి జిల్లాలో 72,081 మంది స్టూడెంట్స్కు యూనిఫాం కుట్టిస్తున్నారు. వీరిలో బాయ్స్34,428 మంది, గర్ల్స్ 37,653 మంది ఉన్నారు. యూనిఫామ్ కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించారు. విద్యార్థుల సైజ్ల ప్రకారం స్టిచ్చింగ్చేయిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభం నాటికి దుస్తులను సిద్ధం చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.