ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఉత్తర్వులు జారీ

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న 3 డీఏలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 10.01శాతం డీఏ 2021 జులై 1 నుంచి వర్తించనుంది. 2021 నుంచి ఉన్న బకాయిలను జీపీఎఫ్ లో జమ చేయనున్నారు. ఈ నెల నుంచి పెరిగిన డీఏ వేతనంతో పాటు ఉద్యోగులకు అందనుంది. కరోనా కారణంగా రెండేళ్లుగా డీఏ చెల్లింపులో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడటంతో మూడు డీఏలను ఒకేసారి చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.