న్యూఢిల్లీ: పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంలోభాగంగా ఎయిరిండియాలో 100 శాతం వాటాలను అమ్మేస్తామని మోడీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇందులో మెజారిటీ వాటాను అమ్మేందుకు 2018లోనూ ప్రయత్నాలు చేసినా, ఏ ఒక్క కంపెనీ కూడా స్పందించలేదు. ఎయిరిండియాను కొనడానికి ఏడాది మార్చి 17లోపు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) ప్రకటించాలని ప్రభుత్వం సూచించింది.బిడ్డింగ్ లో గెలిచిన వాళ్లు ఎయిరిండియా ఆస్తులను తీసుకోవడంతోపాటు అది చేసిన రూ.23 వేల కోట్ల పైగా అప్పులనూ భరించాల్సి ఉంటుంది. అంతేగాక మూడు శాతం షేర్లను కంపెనీ పర్మనెంట్ ఉద్యోగులకు ఈఎస్ఓపీ రూల్స్ ప్రకారం ఇవ్వాలి. ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్స్ కింద ప్రభుత్వం 98 కోట్లషేర్లను జారీ చేసే అవకాశం ఉంది. ఎయిరిండియాలో వందశాతం వాటాతో పాటు ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాను అమ్ముతారు. ఐఏఎస్ఏటీఎస్ను గ్రౌండ్ హ్యండ్లింగ్గ్ సర్వీసుల కోసం సింగపూర్ ఎయిర్లైన్స్ తో కలిసి ఏర్పాటు చేశారు. బిడ్డింగ్ గెలిచిన కంపెనీకే ఎయిరిండియా మేనేజ్ మెంట్ కంట్రోల్ ను కూడా బదిలీ చేస్తారు. కొన్ని ఆస్తుల బదిలీ ఇక నుంచి ఎయిరిండియా ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్, అల్లాయిడ్ సర్వీసెస్, హోటల్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియాలను ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ కు బదిలీ చేస్తారు. వాటా అమ్మకం పరిధిలోకి ఈ కంపెనీ రాదు. ఎయిరిండియా గ్రూప్ అప్పులు రూ.23,286 కోట్లు. ఈ రెండు సంస్థలకు 16,077 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కాంట్రాక్టు ఉద్యోగులూ ఉన్నారు.మరో వైపు ఎయిరిండియాను అమ్మకానికి పెట్టడాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్తానని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి హెచ్చరించారు.
ఎయిరిండియా ఫర్ సేల్.. కోర్టుకెళ్తానన్నసుబ్రమణ్యం స్వామి
- బిజినెస్
- January 28, 2020
లేటెస్ట్
- తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి
- బీజేపీకి బీఆర్ఎస్ అమ్ముడుపోయింది: షబ్బీర్ అలీ
- Kalvan OTT Official: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ కల్వన్..తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- తిరుపతిలో హైటెన్షన్.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
- క్రైం బ్రాంచి పోలీసులమని బెదిరించి ..రూ.25 లక్షలు ఎత్తుకెళ్లారు
- T20 World Cup 2024: రిజర్వ్ డే లేదు.. టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్లో కీలక మార్పు
- V6 DIGITAL 14.05.2024 EVENING EDITION
- వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!
- Pavithra Jayaram: చివరగా దిగిన ఫొటోతో పవిత్ర భర్త ఎమోషనల్ పోస్ట్..నా పవి ఇక లేదు..ప్లీజ్ మళ్ళీరావా
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు