లోక్ సభ భద్రతా ఉల్లంఘన ఘటన తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. పార్లమెంట్ భవనం భద్రతను మరింత పటిష్టం చేస్తోంది. లోక్ సభ, రాజ్యసభ భవనాల భద్రతను CISF బలగాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్లమెంట్ భవన సముదాయాన్ని పరిశీంచాలని కేంద్రం హోంశాఖ అదేశించింది. ఆ తర్వాత సీఐఎస్ ఎఫ్ భద్రత, అగ్నిమాపక విభాగం పార్లమెంట్ కు కాపలా కాస్తాయని బుధవారం (డిసెంబర్ 20) పార్లమెంట్ అధికార వర్గాలు తెలిపాయి. CISFలోని ప్రభుత్వ భవన భద్రత యూనిట్ నుంచి కొందరు నిపుణులు, ప్రస్తుత పార్లమెంట్ భవనంలోని భద్రతా బృందలోని అధికారులతోపాటు భద్రతా బలగాలకు చెందిన ఫైర్ కంబాట్ ,రెస్పాన్స్ అధికారులు ఈ వారం చివరిలో సర్వే చేపట్టనున్నారు.
కేంద్రం నిర్ణయంతో కొత్త, పాత పార్లమెంట్ భవన కాంప్లెక్స్, వాటి అనుబంధ భవనలు రెండూ కూడా CISF భద్రత పరిధిలోని వస్తాయి. CISF లో పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్(PSS), ఢిల్లీ పోలీస్, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ (PDG) కూడా ఉంటాయి. CISF అనేది కేంద్ర సాయుధ పోలీస్ దళం. ఇది ప్రస్తుతం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల భవనాలను, అణు,ఏరోస్పేస్ డొమైన్, విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో ఇన్ స్టాలేషన్ లకు భద్రతను కల్పిస్తోంది.
2001 పార్లమెంట్ ఉగ్రదాడి వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 13న జరిగి లోక్ సభ భద్రతా ఉల్లంఘనలో జీరో అవర్ లో ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్ సభ ఛాంబర్ లోకి దూకి పసుపు కలర్ స్మోక్ విడుదల చేసి భయాందోళనకు గురి చేశారు. అదే సమయంలో మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణ వెలుపల నినాదాలు చేస్తూ కలర్ స్మోక్ ని చల్లడం దేశవ్యాప్తంగా సంచలనం రేగింది.
ప్రస్తుతం సీఆర్ పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్ అధ్యక్షతన కమిటీ పార్లమెంట్ సముదాయం భద్రత సమస్యలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పార్లమెంట్ మొత్తం సెక్యూరిటీని CISF కి అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది.