సొంతపార్టీ జడ్పి చైర్మన్ ను నిలదీసిన కార్యకర్త

సొంతపార్టీ జడ్పి చైర్మన్ ను నిలదీసిన కార్యకర్త

ఖమ్మం జిల్లా: ప్రభుత్వ పథకాలు సకాలంలో గ్రామస్థులకు అందండంలేదని ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మైన్ (టీఆర్ఎస్)ను నిలదీశాడు అదే పార్టీకి చెందిన కార్యకర్త. వైకుంఠధామం ప్రారంభోత్సవం కోసం శుక్రవారం ఎర్రుపాలెం మండలం, కొత్తపాలెం గ్రామానికి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరయ్యారు. అయితే టిఆర్ఎస్ పార్టీకి చెందిన రావూరి వెంకటేశ్వర్లు అనే కార్యకర్త లింగాల కమల్ రాజు  నిలదీశాడు. మా గ్రామంలో రైతుబంధు పథకానికి అర్హులైన వారికి రైతుబంధు అందడం లేదు, రైతుబీమా లేదు. మా ఊర్లో చనిపోయిన మహిళా రైతుకు రైతు బీమా ఇంతవరకు అందలేదు. వాళ్ళది పేద కుటుంబం, ధరణి వెబ్ సైట్ వల్ల నష్టాలు జరుగుతున్నాయని.. ఇవన్నీ అయ్యేటట్లు చూడాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుని నిలదీసి అడిగాడు కార్యకర్త. అతడికి తోడు గ్రామస్థులు కూడా తోడయ్యారు. ప్రారంభోత్సవాలకు, ఓట్లప్పుడే లీడర్లు కనబడుతారని.. మా సమస్యలకు పరిష్కారం చూపాలంటూ వినతి పత్రాలు ఇచ్చారు బాధితులు.