మే 13 నుంచి ప్రభుత్వ టీచర్లకు ట్రైనింగ్

మే 13 నుంచి ప్రభుత్వ టీచర్లకు ట్రైనింగ్

హైదరాబాద్, వెలుగు: జిల్లాస్థాయిలో గవర్నమెంట్ టీచర్లకు ఈ నెల13 నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానున్నది. హైస్కూల్ హెడ్మాస్టర్లు, టీచర్లకు మంగళవారం నుంచి 20 వరకు సబ్జెక్టులవారీగా శిక్షణ ఇస్తారు. ఎస్జీటీలకు మండలస్థాయిలో 20 నుంచి ట్రైనింగ్​ ప్రారంభం కానున్నది. అయితే, జులై వరకు రిటైర్డ్ కానున్న టీచర్లకు మినహాయింపు ఇచ్చారు.

 2008 స్పెషల్ విద్యా వలంటీర్లు (ఎస్జీటీ) మండలస్థాయిలో ట్రైనింగ్​కు అటెండ్ కావాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆదేశాలిచ్చారు. హైస్కూళ్లలో ఇన్​చార్జి హెచ్​ఎంలుగా పనిచేస్తున్న వారంతా స్కూల్ అసిస్టెంట్ కేడర్​లోని ట్రైనింగ్​కు అటెండ్ కావాలని సూచించారు. ఈ నెల 31లోగా టీచర్ల ట్రైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని డీఈవోలకు సూచించారు.