
కూకట్పల్లి, వెలుగు: టెక్నికల్ విద్యలో జేఎన్టీయూ హైదరాబాద్దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని గవర్నర్జిష్ణుదేవ్వర్మ తెలిపారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి స్టూడెంట్లు వచ్చి విద్యను అభ్యసించటం గర్వకారణం అన్నారు. జేఎన్టీయూ13వ స్నాతకోత్సవాన్ని మంగళవారం క్యాంపస్లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గవర్నర్పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు పోటీ తత్వాన్ని పెంచుకోవాలన్నారు. జ్ఞానాన్ని వ్యక్తిగత అభివృద్ధితోపాటు సమాజ సేవ కోసం వినియోగించాలన్నారు.
25 దేశాల నుంచి 237 మంది విద్యార్థులు జేఎన్టీయూలో చేరటంతో గ్లోబల్ గా గుర్తింపు లభించిందని, ఈ అవకాశాలను ఇక్కడి విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకుని అన్ని ప్రాంతాల్లో ఉపాధి పొందాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్సిటీకి రూ.498 కోట్ల పరిశోధనా నిధులు మంజూరు చేసిందంటే ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. 2023–-24 సంవత్సరంలోయూజీ, పీజీ, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, డాక్టరేట్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన 91,840 విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. వీరిలో గోల్డ్మెడల్సాధించిన 74 మంది విద్యార్థులను గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ప్రత్యేకంగా అభినందించారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ఎడ్యుకేషన్చైర్మన్ టి.జి.సీతారాం, వీసీ కిషన్కుమార్రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, రెక్టార్ విజయ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.