
అమరావతి : రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రుల ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాజధాని అమరావతి చేరుకున్నారు గవర్నర్ నరసింహన్. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో కొత్త మంత్రులతో ఆయన ప్రమాణం చేయించనున్నారు.
విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు ప్రభుత్వ అధికారులు, డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వాగతం పలికారు.