సెయిలింగ్ క్రీడ చాలా కష్టమైనది

సెయిలింగ్ క్రీడ చాలా కష్టమైనది

హుస్సేన్ సాగర్ లో 35వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ను ప్రారంభించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. ఈ నెల 19 వరకు సెయిలింగ్ వీక్ జగరనుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సెయిలర్లకు స్వాగతం పలికారు గవర్నర్. సెయిలింగ్ క్రీడ చాలా కష్టమైనదని... గాలి వేగాన్ని తట్టుకుని ముందుకెళ్లడం గొప్ప విషయమన్నారు తమిళిసై. ఒలింపిక్స్ లో పాల్గొన్న సెయిలర్స్ కుమరన్, విష్ణు శరవణన్ లను సత్కరించారు గవర్నర్. భవిష్యత్ లో మంచి ప్రదర్శన కనబరిచి దేశానికి పతకాలు తీసుకురావాలని సెయిలర్స్ ను కోరారు.