ప్రోటోకాల్ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు: తమిళి సై

ప్రోటోకాల్ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు: తమిళి సై

కోర్టు కేసులు, విమర్శలు, ప్రోటోకాల్ ఉల్లంఘనలతో తనను కట్టడి చేయలేరన్నారు  తెలంగాణ గవర్నర్ తమిళి సై.  గవర్నర్ గా నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు తమిళి సై.. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. తెలంగాణకు తొలి మహిళా గవర్నర్ గా పని చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. గవర్నర్ పదవి ఇచ్చినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.  

ప్రజల విజయమే తన విజయం అని తమిళి సై అన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికే ప్రయత్నించా.. 15 శాతమే చేశా ఇంకా ఎంతో చేయాలన్నారు.  తనకు ఎలాంటి కన్నింగ్ మనస్తత్వం లేదన్నారు. స్ట్రాంగ్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చానని.. గవర్నర్ గా తనకు కొన్ని పరిమితులున్నాయని చెప్పారు. తాను ఎక్కడున్నా తెలంగాణ బంధం మరిచిపోనని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షకురాలిగా తన విధులను, బాధ్యతలు, ఈ సవాళ్లను అధిగమించానని చెప్పారు.  తాను సవాళ్లకు, పంతాలకు భయపడబోనన్నారు.