శామీర్ పేట, వెలుగు : రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గవర్నర్ తమిళిసై అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం అలియాబాద్ చౌరస్తాలోని రత్నాలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న నవదుర్గ యాగం పూర్ణాహుతి కార్యక్రమానికి ఆదివారం రాత్రి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెను శాలువతో సన్మానించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ... యాగ ఫలితం ప్రజలందరికి కలగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.