హన్మకొండకు చేరుకున్న గవర్నర్ తమిళిసై

హన్మకొండకు చేరుకున్న గవర్నర్ తమిళిసై

రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ హన్మకొండకు చేరుకున్నారు. గవర్నర్ కు జిల్లా కలెక్టర్ సిక్తా ప‌ట్నాయ‌క్, సీపీ రంగనాథ్ స్వాగతం పలికారు.  మహాశివరాత్రి సందర్బంగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారు. గవర్నర్ తోపాటు అవధాని మాడుగుల నాగఫణిశర్మ, సినీ డైరెక్టర్ విజయేంద్రప్రసాద్, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు. శివరాత్రి జాగారం ఉండే భక్తుల కోసం ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం ఏర్పాటు చేశారు.