కంది, వెలుగు: నేటి తరం స్టూడెంట్లు ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకెళ్లాలని గవర్నర్ తమిళిసై సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలో కందిలోని ఐఐటీహెచ్లో ఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫౌండేషన్ వీక్ సంబరాలలో భాగంగా మూడ్రోజుల వర్క్షాప్ను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టూడెంట్లు పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు మార్గాలను అన్వేషించాలన్నారు. కార్యక్రమంలో భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, స్టూడెంట్లు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.