రాజకీయాలు మాట్లాడే హక్కు గవర్నర్లకు కూడా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాజకీయ చర్చల్లో పాల్గొనడానికి రాజకీయ పార్టీల నేతలకు ఉన్న హక్కు గవర్నర్లకు ఉందని ఆమె తెలిపారు. గవర్నర్లు రాజకీయాల గురించి చర్చించడం మానుకోవాలని తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై ఇటీవల చేసిన వ్యాఖ్యలను గానూ తమిళిసై ఈ కామెంట్స్ చేశారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో పాటు ఇటీవలి రాజకీయ పరిణామాలను అన్నామలై ప్రస్తావించారు . గవర్నర్లు రాజకీయాల గురించి చర్చించడం, క్రమం తప్పకుండా విలేకరుల సమావేశాలు నిర్వహించడం మానుకోవాలని అన్నామలై సూచించారు.ఈ క్రమంలో తమిళిసై స్పందించారు. కోయిమబ్టోర్ విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడిన తమిళిసై.. రాజకీయాలు మాట్లాడే హక్కు గవర్నర్లకు ఉందని, వారి అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందని స్పష్టం చేశారు.