మెదక్​ జిల్లా​ డీఏవోగా గోవింద్​

మెదక్​ జిల్లా​ డీఏవోగా గోవింద్​

మెదక్​ టౌన్​, వెలుగు :  మెదక్​ జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో)గా గోవింద్​ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కలెక్టరేట్​లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారిణిగా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన ఆశాకుమారి నుంచి గోవింద్​ ఛార్జి తీసుకున్నారు. ఆయన హైదరాబాద్​ వ్యవసాయ కమిషనర్​ కార్యాలయం నుంచి బదిలీపై రాగా, మెదక్​లో విధులు నిర్వహిస్తున్న ఆశాకుమారి హైదరాబాద్​కు బదిలీపై వెళ్లారు. 

ఈ సందర్భంగా గోవింద్​ మాట్లాడుతూ  రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారికి ఎపటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో డీఏవో కార్యాలయ సిబ్బంది ఆశా వెరోనికా, విఠల్,  ఏవోలు గంగమల్లు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.