కెమికల్స్, పెట్రోకెమికల్స్​ కోసం పీఎల్​ఐ! : నిర్మలా సీతారామన్​

కెమికల్స్, పెట్రోకెమికల్స్​ కోసం పీఎల్​ఐ! : నిర్మలా సీతారామన్​

న్యూఢిల్లీ: కెమికల్స్​, పెట్రోకెమికల్స్​ రంగాల కోసం ప్రొడక్షన్​ లింక్డ్​ ఇన్సెంటివ్​ (పీఎల్​ఐ) స్కీమును తెచ్చే ప్లాన్​ పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. కెమికల్స్​, పెట్రోకెమికల్స్​ ప్రొడక్షన్​లో ఇండియాను మాన్యుఫాక్చరింగ్​హబ్​గా చేయడానికి పీఎల్​ఐ సాయపడుతుందని చెప్పారు. కఠినమవుతున్న పొల్యూషన్​ కంట్రోల్​ రెగ్యులేషన్లు, లేబర్​ ఖర్చుల నేపథ్యంలో కెమికల్స్​ తయారీ రంగంలోని  గ్లోబల్​ మాన్యుఫాక్చరర్లు తమ ప్రొడక్టులలో మార్పుతోపాటు, సామర్ధ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి టైములో వారికి  ఇండియా సరైన వేదికవుతుందని  నిర్మలా సీతారామన్​ సూచించారు. 

మన దేశంలో మాన్యుఫాక్చరింగ్​ మొదలుపెట్టే ఆలోచనను ఆయా గ్లోబల్​ కంపెనీలు చేయొచ్చని పేర్కొన్నారు. అంతేకాదని, మన దేశపు మార్కెట్​ కూడా పెద్దదవడం ఆ గ్లోబల్​ కంపెనీలకు కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డారు. గ్లోబల్​ కెమికల్స్​ అండ్​ పెట్రోకెమికల్స్​ మాన్యుఫాక్చరింగ్​ హబ్స్​ ఇన్​ ఇండియా సమ్మిట్​లో ఫైనాన్స్​ మినిస్టర్​ గురువారం  నాడు పాల్గొన్నారు. కొత్త మాన్యుఫాక్చరింగ్​ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలంటే అనుకూలతలు ఉండాలని, దేశీయ వినియోగం ఒక అనుకూలత  కాగా, ఎగుమతులు ఎటూ నిర్వహించుకునే వీలుంటుందని నిర్మలా సీతారామన్​ పేర్కొన్నారు. ఇలాంటప్పుడే ప్రభుత్వ విధానాలు సానుకూలంగా ఉండటం అవసరమని వివరించారు. 

ఇండియా మాన్యుఫాక్చరింగ్​ హబ్​గా మారాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చెబుతూ, ఈ దిశలో కెమికల్స్​, పెట్రోకెమికల్స్​ ఇండస్ట్రీ కోసం పీఎల్​ఐ స్కీము ప్రపోజల్​ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సస్టెయినబిలిటీ, కార్బన్​ ఎమిషన్​, జనరల్​ పొల్యూషన్​, గ్రౌండ్​ వాటర్​ పొల్యూషన్​వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని మాన్యుఫాక్చరింగ్​ కెపాసిటీ పెంచుకునే దిశలో చర్యలు తీసుకోవాలన్నారు. ఎనర్జీ రంగంలో 2047 నాటికి స్వయం ప్రతిపత్తి సాధించాలని, 2070 నాటికి నెట్​ జీరో కార్బన్​ దేశంగా మారాలని టార్గెట్​గా పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నెట్​ జీరో కార్బన్​ లక్ష్యాన్ని అందుకోవాలంటే...అన్ని రంగాలలోని పరిశ్రమల సహకారంతోనే సాధ్యపడుతుందని పేర్కొన్నారు.

ALSO READ:వర్షాల బాధితులను ఆదుకోండి.. కలెక్టర్లకు బండి సంజయ్ ఫోన్​

గ్రీన్​  గ్రోత్ ​పైనే ఫోకస్​....

గ్రీన్​ గ్రోత్​పై ఫోకస్​ పెడుతున్నట్లు నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. కార్బన్ ​ ఇంటెన్సిటీ తగ్గించే దిశలో చొరవ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇంథన సామర్థ్యం, రెన్యువబుల్​ ఎనర్జీ కమిట్​మెంట్స్​ను దేశం కాపాడుకోవడం ఆవశ్యకమని చెప్పారు. ప్రైవేటు రంగం నెట్​ జీరో గోల్​, 500 గిగావాట్ల  రెన్యువబుల్​  ఎనర్జీ  కెపాసిటీ అంశాలను గుర్తు పెట్టుకోవాలని కోరారు. హైడ్రోజన్​ మిషన్​ను కూడా దృష్టిలో పెట్టుకోమని సూచించారు. దేశంలో గ్రీన్​ హైడ్రోజన్​ను ప్రమోట్​ చేసేందుకు రూ. 19,744 కోట్లతో ఇన్సెంటివ్​ ప్లాన్​ను ప్రభుత్వం ఆమోదించిందని అన్నారు. ఏడాదికి కనీసం 5 మిలియన్​ మెట్రిక్​ టన్నుల గ్రీన్​ హైడ్రోజన్​ ప్రొడక్షన్​ కెపాసిటీ ఏర్పాటును నేషనల్​ గ్రీన్​ హైడ్రోజన్​ మిషన్​ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.