రైతుబంధు సాయం పెంచిన ప్రభుత్వం

రైతుబంధు సాయం పెంచిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు సాయాన్నిపెంచుతూ జీవో జారీ చేసింది. పెట్టుబడి సాయంగా ఇప్పటి వరకు ఎకరాకు రూ.4 వేలు ఇస్తున్న ప్రభుత్వం  ఎన్నికల హామీ మేరకు మరో వెయ్యి రూపాయలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు విడతలుగా రైతులకు మొత్తం రూ.10 వేలు అందనుంది.