
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రామ పాలనా అధికారి (జీపీవో) ఎగ్జామ్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. శుక్రవారం తన చాంబర్లో జీపీవో పరీక్షపై నిర్వహించిన సమీక్షలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు. నగరంలోని గవర్నమెంట్ గిరిరాజ్ డిగ్రీ కాలేజీలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరగనుందని, 330 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. గంట ముందు నుంచే సెంటర్లోకి అనుమతించాలన్నారు.
పరీక్ష సాఫీగా ముగిసేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక అనుమతించొద్దని తెలిపారు. సమీక్షలో ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా ట్రాన్స్ఫోర్ట్ఆఫీసర్ ఉమా మహేశ్వర్రావు, ఏసీపీలు రాజావెంకట్రెడ్డి, వెంకటేశ్వర్, తహసీల్దార్ బాలరాజ్, సూపరింటెండెంట్ పవన్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జీపీవో ఎగ్జామ్
కామారెడ్డి టౌన్, వెలుగు : ఈ నెల 25న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జీపీవో ఎగ్జామ్ ఉంటుందని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎగ్జామ్ నిర్వహణపై అధికారులు, ఇన్విజిలేటర్లతో నిర్వహించిన మీటింగ్ కలెక్టర్ మాట్లాడారు. మాస్కాపీయింగ్కు తావులేకుండా పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలన్నారు. ఉదయం 10.30 నుంచి మద్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, 402 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. పరీక్ష కేంద్రంలో సరైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. సమీక్షలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నారు.