ఘనంగా మిలాద్ జూలూస్ ర్యాలీలు..

ఘనంగా  మిలాద్ జూలూస్ ర్యాలీలు..

హైదరాబాద్ లో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ ర్యాలీలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మక్కా మసీదు వద్ద ప్రార్ధన చేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ గుల్జార్ హౌజ్, పత్తర్​గట్టి, మదీనా, నయాపూల్, దారుల్​ఫిషా, పురానీ హవేలి, మీర్ ఆలం మండి, ఎతేబార్ చౌక్, మొఘల్​పురా వరకు కొనసాగింది. అలాగే ఫలక్​నుమా, మిస్రిగంజ్​ప్రాంతాల నుంచి మరికొన్ని ర్యాలీలు జరిగాయి. ఊరేగింపు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు సిటీ పోలీసులు 3 వేల మందితో బందోబస్త్ ఏర్పాటు చేశారు.

– వెలుగు, హైదరాబాద్ ​సిటీ–