తెలంగాణ కోసమే.. తెలంగాణ జర్నలిస్టులు

తెలంగాణ కోసమే.. తెలంగాణ జర్నలిస్టులు
  • టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఢిల్లీలో ఘనంగా దశాబ్ది వేడుకలు

న్యూఢిల్లీ, వెలుగు: ‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అన్న నినాదంతో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టు సమాజం చేసిన సేవలు మరువలేనివని టీయూడబ్ల్యూజే ఢిల్లీ నాయకత్వం పేర్కొంది. తెలంగాణ దశాబ్ది అవతరణ ఆవిర్భావం దినోత్సవాలను టీయూడబ్ల్యూజే ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో ఘనంగా నిర్వహించింది.

అమరవీరుల స్తూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి జర్నలిస్టులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం దశాబ్ది ఉత్సవాల కేక్  కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.