
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెందిన మల్టీబ్రాండ్ మొబైల్, ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ సెల్బే చేగుంటలో ఏర్పాటు చేసిన కొత్త షోరూమ్ను టాలీవుడ్ నటి శ్రీముఖి ప్రారంభించారు. మెదక్ జిల్లాలోని చిన్న పట్టణంలోని ఇంత అద్భుతమైన షోరూమ్లో భాగమైనందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు . ఇక్కడ మొబైల్ హ్యాండ్సెట్లు, యాక్సెసరీలు, స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు పర్సనల్ కేర్ ప్రొడక్టులను అమ్ముతారు. స్థానికులు సెల్బే షోరూమ్ని సందర్శించి వారికి ఇష్టమైన వస్తువు కొని ప్రారంభ ఆఫర్లను పొందాలని ఆమె కోరారు.
ప్రతి స్మార్ట్ఫోన్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉందని, ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేయవచ్చని చెప్పారు. రూ. తొమ్మిది వేల నుంచి అండ్రాయిడ్ టీవీలు లభిస్తాయని పేర్కొన్నారు. సెల్బే ఎండీ సోమ నాగరాజు మాట్లాడుతూ, అత్యుత్తమ ఉత్పత్తులు సేవలను అందించడం ద్వారా తన తన వినియోగదారులకు అత్యుత్తమ షాపింగ్ అనుభవాన్ని అందించడంలో సెల్బే ఎల్లప్పుడూ మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పారు. ఇది తన వినియోగదారులకు అమ్మకాల తర్వాత ఉత్తమ సేవలను కూడా అందిస్తుంది. అర్హతగల కస్టమర్లు మొబైల్ హ్యాండ్సెట్లు, టీవీలు, ల్యాప్టాప్లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి ఫైనాన్స్ ఆప్షన్లను పొందవచ్చని ఆయన చెప్పారు.