- నిఖత్ జరీన్కు ఘన స్వాగతం
- నజరానాలు ప్రకటించిన మంత్రి, ఎమ్మెల్యేలు
నిజామాబాద్ టౌన్, వెలుగు: టర్కీ లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి గురువారం నిజామాబాద్ వచ్చిన నిఖత్జరీన్కు ఘన స్వాగతం లభించింది. ఫులాంగ్ చౌరస్తా నుంచి తిలక్ గార్డెన్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. తర్వాత అంబేద్కర్ భవన్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జరీన్కు రూ.లక్ష , ఆమె కోచ్ షంషుద్దీన్కు రూ.50 వేల చెక్కును అందజేశారు. అర్బన్ఎమ్మెల్యే గణేశ్గుప్తా బిగాల కృష్ణమూర్తి ఫౌండేషన్ తరఫున రూ.లక్ష నగదు ఇచ్చారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ బోధన్ లో 200 గజాల స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ నాగరాజు, జడ్పీ చైర్మన్ విఠల్రావు పాల్గొన్నారు.
