
- చంటి పిల్లలతో జీపీఎస్ల సమ్మె
మెదక్, వెలుగు: తమను రెగ్యులరైజేషన్ చేయాలని మెదక్ కలెక్టరేట్ వద్ద 4రోజులుగా సమ్మె చేస్తున్న జీపీఎస్లు సోమవారం పిల్లలతో కలిసి కూర్చున్నారు. ‘ కేసీఆర్ తాత మాకేంటి ఈ బాధ’, ‘మా అమ్మా నాన్నల ఉద్యోగాలు రెగ్యులర్ చేయండి’ అని రాసి ఉన్న ప్లకార్డులను పిల్లలు ప్రదర్శించారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని
అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు.