పాలేరుకు జేఎన్​టీయూ కళాశాల మంజూరు

పాలేరుకు జేఎన్​టీయూ కళాశాల మంజూరు
  • ఈ అకడమిక్​ ఇయర్​ నుంచే క్లాసులు
  • 300 సీట్లు  కేటాయింపు

కూసుమంచి,వెలుగు : పాలేరు  నియోజకవర్గంలోని కూసుమంచి మండలం పాలేరుకు  జేఎన్​టీయూ కళాశాలను మంజూరు చేస్తూ సోమవారం  జీవోను విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ జారీ చేశారు. సీఎస్ఈ, ఈసీఈ, సీఎస్ఈ(డేటా సైన్స్​), ఈఈఈ, మెకానికల్​ ఇంజినీరింగ్ విభాగాలు ​ఉంటాయన్నారు. 300 మంది విద్యార్దులతో ఈ అకాడమిక్​ ఇయర్​ నుంచే క్లాసులు ప్రారంభమవుతాయని జీవోలో పేర్కొన్నారు.

మెడికల్​ కాలేజీ కోసం నిర్మించిన బిల్డింగ్​లో ఐదు బ్రాంచ్ లతో  కాలేజీ ఏర్పాటు కానుంది. దీంతో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్​రెడ్డి కృషి ఫలించినట్లయింది. సీఎం కేసీఆర్ కు, విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి  ఎమ్మెల్యే కందాళ ధన్యవాదాలు తెలియజేశారు.