గ్రాన్యూల్స్ ‘పాంటోప్రజోల్’ టాబ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఆమోదం

గ్రాన్యూల్స్ ‘పాంటోప్రజోల్’ టాబ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఆమోదం

హైదరాబాద్, వెలుగు: జీర్ణ కోశ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 'పాంటోప్రజోల్ సోడియం' మాత్రల  ఏఎన్​డీయేను యూఎస్ ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్ డీ ఏ) ఆమోదించినట్లు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ పాంటోప్రజోల్ సోడియం మాత్రలు 20 ఎంజీ, 40 ఎంజీలలో లభిస్తాయి. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీ ఈ ఆర్ డీ) జీర్ణకోశ వాపు చికిత్స కోసం డాక్టర్లు వీటిని సూచిస్తారు. తమకు యూఎస్ ఎఫ్ డీ ఏ నుంచి మొత్తం 64 ఏ ఎన్ డీ ఏ అప్రూవల్స్​ ఉన్నాయని గ్రాన్యూల్స్​ ఫార్మా తెలిపింది.