హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బలమైన క్లీన్-మొబిలిటీ పర్యావరణ వ్యవస్థ కోసం ఈవీ తయారీ సంస్థ గ్రావ్టన్ మోటార్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది.
రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. గ్రావ్టన్ మోటార్స్ ఈవీ పవర్ట్రెయిన్ ఉత్పత్తి, ఈవీ టూ-వీలర్ తయారీ, అటానమస్ గ్రౌండ్ వెహికల్ (ఏజీవీ) అభివృద్ధికి అధునాతన సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. టీజీ -ఐపాస్ ద్వారా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్కు సహకరిస్తుంది.

