వరల్డ్​కప్​కు వెళ్లేందుకు పాక్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌

వరల్డ్​కప్​కు వెళ్లేందుకు పాక్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌

కరాచీ: ఇండియాలో జరిగే వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఆడుతుందా? లేదా? అనే అనిశ్చితికి తెరపడింది. మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌ కోసం ఇండియాకు వెళ్లేందుకు పాక్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఆ దేశ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ ఆదివారం గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ‘క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టొద్దని మేం భావిస్తున్నాం. వరల్డ్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ నిలకడగా ఆడుతోంది. అందుకే రాబోయే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ కోసం మా టీమ్‌‌‌‌‌‌‌‌ను ఇండియాకు పంపేందుకు గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ అనుమతి ఇచ్చింది. ఇండియాతో ద్వైపాక్షి సంబంధాల పరిస్థితి ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రీడలకు అడ్డంకిగా మారొద్దని మేం విశ్వసిస్తున్నాం’ అని పాక్‌‌‌‌‌‌‌‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.