నిర్మల్, వెలుగు: జిల్లా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో ధరణి సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువ మంది రైతులు తమ పేరుతో ఉన్న భూములు ధరణి లో ఎక్కలేదని పలువురు ఫిర్యాదులు అందిస్తున్నారు. సోమవారం నిర్మల్జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ గ్రీవెన్స్ సెల్ లో పలువురి నుంచి అప్లికేషన్స్ స్వీకరించారు. ధరణి సమస్యలు పరష్కరించాలని పలువురు రైతులు అప్లికేషన్స్ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ సెల్లో ఉన్నతాధికారులు ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. గ్రీవెన్ సెల్ లో 17 అప్లికేషన్స్ స్వీకరించారు. అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్ఖడే, రాంబాబు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, వెలుగు: గ్రీవెన్స్ లో అర్జీదారులు ఇచ్చిన ఫిర్యాదులపై ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి అప్లికేషన్స్ స్వీకరించారు. 2018 నుంచి జిల్లాలో వివిధ ఆశ్రమ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న వారికి మూడు నెలల వేతనంతోపాటు సీఆర్టీ పునరుద్ధరించాలని కోరుతూ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం ఇచ్చారు. రెబ్బెన మండలం గౌతమినగర్కు చెందిన చంద్రశేఖర్ గతంలో తనకు గతంలో ఉన్న పీహెచ్సీ సర్టిఫికేట్ను రద్దు చేశారని, తిరిగి మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు ఇచ్చారు. పెంచికల్ పేట్ మండలం కొండపల్లికి చెందిన సప్పిడి ఈశ్వరి.. ఆమెకున్న పట్టా భూమిలో ఎవుసం చేసుకుంటుండగా ఫారెస్ట్ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. గ్రీవెన్స్లో వచ్చిన దరఖాస్తుల పై ఆఫీసర్లు దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ఆదేశించారు.